గుంటూరు జిల్లా
గుంటూరు GGH హాస్పిటల్)

మంత్రి విడదల రజనీ ఆఫీస్ పై దాడి ఘటనలో 30 మంది పై కేసు నమోదు.

అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసిన నిందితులను వైద్య పరిక్షల కోసం జిజిహెచ్ కు తరలింపు.

మరికొద్ది సేపట్లో కోర్టులో హజరుపర్చనున్న పోలీసులు.

జిజిహెచ్ లో అక్రమంగా చేసిన బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు, జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర రావు,టిడిపి నేతలు నజీర్ అహమ్మద్,కనపర్తి శ్రీనివాస రావు,మన్నవ సుబ్బారావు, వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ (బుజ్జి), ముజీబ్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు...

మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు గారు మాట్లాడుతూ...

నూతన సంవత్సరం సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి ప్రతి యేడాది నివాళ్లు అర్పిస్తారు.

ఆ ప్రాంతం లో మంత్రి విడదల రజనీ ఆఫీస్ పెట్టిందని అక్కడ ఆంక్షలు విధించారు.

మంత్రి రజనీ ఆఫీస్ పెడుతుంది కాబట్టి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు రాకుండా అడ్డుకున్నారు.

ఈ సందర్భంలో రజనీ ఆఫీస్ పై రెండు రాళ్లు పడ్డాయట.దీంతో పోలీసులు, వైసిపి నేతలు నానా యాగీ చేశారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

రాత్రంతా వైసిపి నేతలు అరాచకం సృష్టించారు.

రోడ్డు పై వెళ్లే వాళ్లను అడ్డుకోని స్టేషన్ లకు తరలించి తప్పుడు కేసులు పెట్టారు.

ప్రభుత్వం నుంచి ఒత్తిడి తో అమాయకుల పై కేసులు పెట్టారు.

విడదల రజనీ ఇన్చార్జ్ రావడం వైసిపి నేతలకు ఇష్టం లేదు.వైసిపి లోని గ్రూపు తగాదాలతో రాళ్లు వెసుకున్నారనే అనుమానం ఉంది.

దీనిపై పూర్తి స్దాయి లో విచారణ చేయాలని పోలీసులను కోరుతున్నాం.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group