చరిత్రలోనే అతిపెద్ద విరాళం.. రూ.151 కోట్లు ఇచ్చిన ముఖేష్ అంబానీ! ఎవరికంటే!
Sat Jun 07, 2025 15:52 Business
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు. తాను విద్యనభ్యసించిన ముంబయిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐసీటీ)కి ఏకంగా రూ.151 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని సంస్థ అభివృద్ధికి ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చని ఆయన సూచించారు. విఖ్యాత రసాయన శాస్త్రవేత్త, ప్రొఫెసర్ ఎంఎం శర్మ జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకున్న ‘డివైన్ సైంటిస్ట్’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా ముఖేశ్ అంబానీ ఈ కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ విరాళం తన గురువు ప్రొఫెసర్ శర్మకు ఇచ్చే గురుదక్షిణ అని పేర్కొన్నారు. ముఖేశ్ అంబానీ 1970వ సంవత్సరంలో ఐసీటీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్లో పట్టభద్రులయ్యారు. ఆ రోజుల్లో ఈ సంస్థను యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (యూడీసీటీ)గా పిలిచేవారని ఆయన గుర్తు చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: రాజధానిపై విషం చిమ్మడమే జగన్ పని.. సాక్షిపై తుళ్లూరులో రైతులు, మహిళల భారీ నిరసన!
సుమారు మూడు గంటలకు పైగా ఐసీటీ ప్రాంగణంలో గడిపిన అంబానీ, యూడీసీటీలో తన విద్యార్థి దశ జ్ఞాపకాలను, ప్రొఫెసర్ శర్మతో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. ప్రొఫెసర్ శర్మ దార్శనికత వల్లే భారత ఆర్థిక వ్యవస్థలో కీలక సంస్కరణలకు బీజం పడిందని అంబానీ అభిప్రాయపడ్డారు. "భారత పరిశ్రమను లైసెన్స్ పర్మిట్ రాజ్ కబంధ హస్తాల నుంచి విడిపిస్తేనే దేశం పారిశ్రామికంగా పురోగమిస్తుందని, ప్రపంచ దేశాలతో పోటీ పడగలదని ప్రొఫెసర్ శర్మ బలంగా నమ్మేవారు. ఈ విషయాన్ని అప్పటి పాలకులకు అర్థమయ్యేలా చెప్పడంలో ఆయన విజయం సాధించారు," అని అంబానీ వివరించారు. తన తండ్రి, రిలయన్స్ వ్యవస్థాపకులు ధీరూబాయ్ అంబానీ కూడా దేశ పారిశ్రామిక ప్రగతి కోసం ఎలా తపించేవారో, అదే ఆకాంక్ష ప్రొఫెసర్ శర్మలో కూడా కనిపించేదని ఆయన అన్నారు. ప్రొఫెసర్ శర్మను ‘గురు ఆఫ్ భారత్’గా అభివర్ణిస్తూ, ఆయన సేవలకు గుర్తింపుగా ఈ విరాళాన్ని అందిస్తున్నట్లు ముఖేశ్ అంబానీ సభాముఖంగా తెలిపారు.
ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!
పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..
జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!
ఆ 8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!
అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!
ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!
షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!
రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!
గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!
బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #MukeshAmbani #RelianceIndustries #ICTMumbai #InstituteofChemicalTechnology #MMSharma #Donation #ChemicalEngineering #IndianEconomy #DhirubhaiAmbani #GuruofBharat
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.